ఆన్ లైన్ తరగతులు నిర్వహించవద్దని ప్రైవేటు పాఠశాలలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ప్రైవేటు స్కూళ్లు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆగష్టు 3 వ వారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని సీఎం జగన్ చెప్పారని మంత్రి అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండానే ఆన్ లైన్ తరగతులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. పిల్లలను,తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి అన్నారు.