పోలవరం ప్రాజెక్ట్ను ఏడాది కాలంగా పడుకోబెట్టారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఆరునెలలుగా పనులు ఆపేసి విలువైన సీజన్ కాలాన్ని పోగెట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో పెట్టాల్సిన గేట్లను కూడా పెట్టకుండా చేశారంటూ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్తో ఆటలాడే హక్కు జగన్ సర్కారుకు లేదన్నారు. బాధ్యతతో చేయాల్సిన పనుల్ని పిల్ల చేష్టల్లా చేస్తున్నారంటూ మండిపడ్డారు దేవినేని ఉమ.