ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలు ఆటో నడుపుతున్న ఆటో డ్రైవరు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆటోడ్రైవర్ ని 108 వాహనంలో స్థానిక కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.