ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో మంగళవారం గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, సి. ఆర్. ఐ మురళి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో వైసీపీకే ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి విజ్ఞప్తి చేశారు.