కంభం పట్టణంలో మంగళవారం ఓ యాచకుడు వడదెబ్బతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కంభం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో విగతజీవిగా ఓ వ్యక్తి పడి ఉన్న విషయాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు యాచకుడని గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో యాచించుకుంటూ తిరుగుతున్నాడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిర్ధారించారు.