ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న పింఛన్ దారులు ఎవరు సచివాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్దకు ఎవరు రావొద్దని అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. పింఛన్ దారులకు వారి ఖాతాలలో జమ చేస్తారని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాలో పడని వారికి అధికారులు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు. కావున పింఛన్ దారులుపై విషయాలను గమనించాలని కోరారు.