చంద్రబాబు ఫుడింగి అయితే..పొత్తులెందుకని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నన్ను బచ్చా అంటున్నాడు..పోయే కాలం వచ్చినప్పుడు విలన్లకు హీరో బచ్చానే. ఈ బచ్చానే ప్రతి ఇంటికి మంచి చేసి ఓట్లు అడుగుతున్నాడు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఒక్క మంచి అయినా చేశాడా అని ప్రశ్నించారు. నన్ను ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలతో పొత్తు అవసరమా..? అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు , వంటి కార్యక్రమాలతో తాను ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.