నగరం మండలం మంత్రివారిపాలెం పంచాయతీలోని నాగలవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు 50 కుటుంబాలు వైసీపీలో చేరారు. మంగళవారం రేపల్లెలోని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు కార్యాలయంలో వీరు పార్టీలో చేరగా వీరికి ఎంపీ మోపిదేవి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు తెలిపారు.