వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు. అంబాజీపేట బహిరంగ సభ అనంతరం కోనసీమ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మందపాటి కిరణ్ కుమార్, కోనసీమ జిల్లా తెలుగు మహిళ సోషల్ మీడియా కో-ఆర్టినేటర్ మందపాటి అనితా శుభజ్యోతి సీఎం చేతుల మీదుగా వైయస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు.