రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నారని సామాన్యుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.