మైదుకూరు మునిసిపాలిటీ 2వ వార్డు శెట్టి వారిపల్లి గ్రామానికి చెందిన నాదెండ్ల వీరయ్య, కాల్వపల్లి సిద్దయ్య, కొవ్వూరు సుబ్బారాజు సిద్ధిక్, గౌస్ మొహిద్దీన్, ఖాసిం తదితరులు వారి అనుచరులు 20 కుటుంబాలు సోమవారం మైదుకూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దాసరి బాబు, ధనపాల జగన్, మధుసూదన్ రెడ్డి, తెదేపా, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.