డోన్ మండలంలోని వెంకటాపురం చెరువు తూము సమీపంలో శనివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఓవ్యక్తి ట్రాక్టర్ వెనుక భాగాన ఢీకొట్టి మృతి చెందినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పత్తికొండ మండలంలోని యంజెతాండాకు చెందిన శంకర్ నాయక్(43)నాటుసారా విక్రయిస్తుంటారు. శనివారం తెల్లవారుజామున తిరిగి పత్తికొండకువెళ్తుండగా వెంకటాపురం చెరువు వద్ద ద్విచక్రవాహనం, ట్రాక్టర్ వెనుక భాగాన ఢీ కొట్టింది.