వైసీపీ పాలనలో పేద ప్రజానీకం దగాపడ్డారని రాజాం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. కోండ్రు మురళీమోహన్ ఆదివారం వంగర మండలం చంద్రంపేట, చౌదరివలస, ఇరువాడ, కోణంగిపాడు, గీతనాపల్లి, సంగాం, ఓనిఅగ్రహారం, మగ్గూరు, తలగాం, కొండచకరాపల్లి, కొప్పర, కొత్తవలస గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సూపర్ సిక్స్ బీసీ డిక్లరేషన్లపై ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.