ఎన్నికల నేపథ్యంలో సోమవారం పులివెందుల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. గత మేనిఫెస్టోలో 99 శాతం చేశానని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ విడుదలలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు.