మైదుకూరు మున్సిపాలిటీ వైకాపా కి చెందిన ఆరిఫ్, రెహ్మాన్, అస్యాక్, షేక్ ఆరిఫ్, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్, అబ్దుల్ సోమవారం మైదుకూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వారు పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపుకి కృషి చేస్తామన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ వారికి టిడిపి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.