ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల వేళ ఏపీవాసులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 07:57 PM

అసలే ఎండాకాలం.. ఆపై సెలవు రోజులు. దీంతో రైళ్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా రైళ్లల్లో భారీ రద్దీ ఉంటోంది. ఈ నేపథ్యంలో వేసవిలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వేసవిలో ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతోంది. సాధారణ రైళ్లకు అదనంగా వీటిని నడుపుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కొన్నిచోట్ల వారాంతాల్లో నడస్తుండగా .. మరికొన్ని మార్గాల్లో మామూలు రోజుల్లోనూ ఈ రైలు సర్వీసులను నడిపిస్తున్నారు. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి- శ్రీకాకుళం, కాచిగూడ- కాకినాడ, హైదరాబాద్- నరసాపురం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.


07025 నంబరు గల సమ్మర్ స్పెషల్ ట్రైన్ కాచిగూడ - కాకినాడ మార్గంలో నడపనున్నారు. మే 9వ తేదీ గురువారం కాచిగూడలో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ రైలు.. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ చేరుకుంటుంది. అలాగే 07026 నంబరుతో మే 10వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు కాకినాడలో బయల్దేరి.. శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది.అలాగే 07487 నంబరుతో నాందేడ్- కాకినాడ మార్గంలోనూ ప్రత్యేక రైలు అందుబాటులోకి తెచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు నాందేడ్‌లో బయల్దేరనున్న ఈ రైలు.. మరుసటి రోజు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు కాకినాడ చేరుకుంటుంది. అలాగే అదేరోజు సాయంత్రం ఆరున్నరకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం మూడుగంటలకు నాందేడ్ చేరుకుంటుంది.


ఇక హైదరాబాద్- నరసాపురం మార్గంలోనూ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.మే 11వ తేదీ 07175 నంబరుతో హైదరాబాద్ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరనున్న ఈ స్పెషల్ ట్రైన్... మరుసటి రోజు ఉదయం 8 గంటల 35 నిమిషాలకు నర్సాపురం చేరుకుంటుంది. అదేవిధంగా మే 13వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు 07176 నంబరుతో నర్సాపురం నుంచి బయల్దేరనున్న ప్రత్యేకరైలు.. మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.


ఇక సికింద్రాబాద్- కాకినాడ రూట్లోనూ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. 07271 నంబరుతో మే పదో తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరనున్న రైలు.. మరుసటి రోజు ఉదయం ఎనిమిదింటికి కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఇక అదే రోజు రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిదిన్నరకల్లా సికింద్రబాద్ చేరుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com