కల్నల్ సంతోష్బాబు తండ్రి ఉపేందర్కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదివారం ఫోన్ చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి పరామర్శించారు. సంతోష్బాబు దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన ధన్యజీవి అని చంద్రబాబు కొనియాడారు. సంతోష్ ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. సంతోష్బాబు మృతి దేశానికి తీరని లోటన్నారు.