కందుకూరు పట్టణంలోని 24 వ వార్డులో సోమవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ వార్డ్ లో వివిధ వ్యాపారస్తులను, ప్రజలను పలకరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు మరియు పార్లమెంట్ అభ్యర్థి అయిన విజయసాయి రెడ్డి కి చెరొక ఒక ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కొనసాగింపునకు మరోమారు జగన్ ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరిస్తూ ఓట్ల అభ్యర్థించారు.