ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్ మరణంతో మనస్థాపం.. తెలుగమ్మాయి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 08:03 PM

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమానులు ప్రాణాలు తీసుకోవడం కలవరపెడుతుంది. ఆయనపై ఉన్న అభిమానంతో కొందరు అభిమానులు తమ హీరో మాదిరే ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా మల్కాపురంలో జూన్ 19న ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్‌పుత్ర నగర్‌లోని సుమన్‌ కుమారికి టిక్‌ టాక్‌ వీడియోలు చూడడం బాగా అలవాటు.ఇటీవల డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ మరణం గురించి తరుచూగా టిక్‌టాక్‌లో చూస్తూ గడిపింది. దాంతో ఈమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. సుశాంత్‌కు వీరాభిమాని అయిన కుమారి ఆయనలాగే ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర ఒత్తిడికి గురైన సుమన్‌ కుమారి ఇంట్లోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్‌లో ఓ పదో తరగతి విధ్యార్థితో పాటు మరో కుర్రాడు అభిమాన హీరో మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి మీరు ఇలా ప్రాణాలు తీసుకోవద్దని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేత అభిమానులకు విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com