కరోనా వైరస్ దెబ్బకి స్కూళ్లు కాలేజీలు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వంటివి అన్నీ క్లోజ్ అయ్యాయి. దీంతో ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వ్యవస్థలోకి మారిపోతున్నారు. దీంతో ఆన్లైన్ క్లాసులకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో డబ్బు సంపాదించాలని భావించే వారికి ఒక మంచి ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. రోజుకు 3 గంటలు పని చేస్తే చాలు నెలకు రూ.40,000 సంపాదించొచ్చు. పిల్లలకు 3 గంటలు ఆన్లైన్ పాఠాలు చెప్పడం, అలాగే టీచర్లకు 2 గంటలపాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం వంటివాటి వల్ల డబ్బులు సంపాదించవచ్చు. ఇంట్లోనే ఖాళీగా కూర్చొవడం ఇష్టం లేని వాళ్లు ఈ పద్దతిలో సొంతంగానే డబ్బులు సంపాదిస్తున్నారు. కేజీ నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు వివిధ సబ్జెక్టులలో పాఠాలు చెబితే చాలు. దీని కోసం ఒక కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. ఆ కంపెనీ పేరు క్యూమ్యాథ్. దీనికి దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా సెంటర్లు ఉన్నాయి. డబ్బు సంపాదించాలంటే ముందుగా ఈ కంపెనీలో మెంబర్ అవ్వాలి. దీని కోసం కంపెనీ వెబ్సైట్కు వెళ్లి టీచర్గా రిజిస్టర్ చేసుకోవాలి. మీకు టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఎంపిక అయితే టీచర్ సభ్యత్వం లభిస్తుంది. దీనికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి వరకు మ్యాథ్స్ చెప్పగలగాలి. మీకు కంపెనీ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. దీనికి రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రూమ్లో కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పొచ్చు.