విశాఖ లైట్ మెట్రో పనులు ప్రారంభించే దిశగా సర్కార్ అడుగులు వేసింది. సెక్రటేరియాట్ తరలింపుతో పాటే మెట్రో పనులు ప్రారంభించేలా సన్నాహాలు చేపట్టింది. రెండు దశల్లో లైట్ మెట్రో , మూడు దశల్లో త్రం కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. బీచ్ వెంబడి ట్రామ్ కారిడార్లు వచ్చేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. పాత పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్కే బీచ్ మీదుగా బీమిలి బీచ్ వరకు ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్ఏడి జంక్షన్- పెందుర్తి, అనకాపల్లి- స్టీల్ ప్లాంట్ వరకు మరో 2 ట్రామ్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక, తాటిచెట్లపాల్లెం, కొమ్మాది మీదుగా భోగాపురం ఎయిర్ పోర్టు వరకు లైట్ మెట్రో కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 140 కిలోమీటర్ల మేరా లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్లు వేయనున్నారు. ఎమ్ఆర్సీ అధికారులు డిపిఆర్ రూపకల్పనతో పాటు టెండర్లు ఖరారు చేయనున్నారు.