ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిశ ఘటన ఎఫెక్ట్... ఏపీలో ‘జీరో’ ఎఫ్ఐఆర్ అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2019, 06:52 PM

ఏపీలో జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులకు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలోనే ఏపీలో జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలులోకి వస్తే ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. తెలంగాణలో దిశ అత్యాచారం, హత్య ఘటన తరువాత జీరో ఎఫ్ఐఆర్ విధానంపై మరోసారి చర్చ మొదలైంది.


దిశ అత్యాచారం, హత్య ఘటనకు ముందు పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని... ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని పోలీసులు అన్నట్టు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com