ఏపీలో తెలుగుదేశం పార్టీ - జనసేన- బీజేపీ కూటమి 145 అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు. సీఎం జగన్ ఈ ఎన్నికల్లో వై నాట్ 175 అంటున్నాడని.. అలాంటప్పుడు తన పార్టీ అభ్యర్థులను వేర్వేరు చోట్ల నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టారని ప్రశ్నించారు. కూటమి పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతుందని చెప్పారు. బీజేపీ జగన్ ను వదిలేసిందని అంటే.. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని అర్థమని అన్నారు.