తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. బ్రహ్మత్సవాల చివరి రోజున అమ్మవారి చక్రస్నానం కన్నుల పండువగా సాగింది. అశేష భక్త జనసందోహంతో పద్మ సరోవరం కిక్కిరిసి పోయింది. సిరుల తల్లితోపాటు భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాల ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు.