అప్పగిస్తున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో సమన్వయం కోసం పలువురు నేతలకు కీలక బాధ్యతలు ఇస్తున్నారు. ఇప్పటకే పలువురికి పదవులు కేటాయించగా.. తాజాగా మరికొందరికి పదవులు దక్కాయి. ముఖ్య నేతలకు నియోజవర్గాల వారీగా ఎన్నికల్ని సమన్వయం చేసే బాధ్యతల్ని అప్పగించారు.
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్రెడ్డి, వీఎస్ అమీర్బాబు, ఆర్.జితేంద్రగౌడ్, చీరాల గోవర్ధన్రెడ్డి, ఎం.వెంకటేశ్వరరావులను నియమించారు. అలాగే మరో పదిమందిని పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా, 12మందిని కార్యదర్శులుగా నియమించారు. అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వీరందరిని ఆయా పదవుల్లో నియమించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలియజేశారు.
మెట్టుకూరు ధనుంజయరెడ్డి, కత్తెర సురేష్, భూమా బ్రహ్మానందరెడ్డి, మల్లెల రాజేష్నాయుడు, పూల నాగరాజు, తమ్మినేని నటేష్చౌదరి, కాకరవాడ చిన్న వెంకటస్వామి, జి.లక్ష్మిరెడ్డి, కర్రి సాయికృష్ణ, చమరపాకు దివాకర్రెడ్డిలను కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించినట్లు తెలిపారు. తూగుట్ల మధుసూధన్రెడ్డి, కె.హరిచంద్రరెడ్డి, ఎల్సీవీ రమణరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, ఎస్ఎండీ ముస్తక్ హుస్సేన్, కృష్ణ చైతన్యయాదవ్, వాసంశెట్టి సత్య, రావెల్ల వీరేంద్ర చౌదరి, సాకె గంపన్న, యలగల నూకాలమ్మ, జి.సూర్యనారాయణ, కంటె కేశవరావులను నియమించారు.
మరోవైపు ఎన్నికల కోసం పలువురిని ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమించారు. అనంతపురం లోక్సభ స్థానం ఎన్నికల సమన్వయకర్తగా కె.ఈరన్న.. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సీఆర్ రాజన్, శ్రీరామినేని చంద్రప్రకాశ్లకు బాధ్యతలు అప్పగించారు. అలాగే అరకు సీటుకు టి.హర్షవర్ధన్ప్రసాద్లను ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించినట్లు టీడీపీ తెలిపింది. శాసనసభ స్థానాలకు కూడా సమన్వయకర్తల్ని నియమించారు. గన్నవరం నియోజకవర్గానికి ఎం.వెంకటేశ్వరరావు, తిరువూరుకు కె.విజయబాబు, జగ్గయ్యపేటకు యంవీఆర్ చౌదరి, పాతపట్నానికి కె.రాజబాబులను ఎంపిక చేశారు. అంతేకాదు మైనారిటీ సెల్ కార్యదర్శిగా సయ్యద్ మెహతాజ్బేగం, తెలుగు యువత ప్రధానకార్యదర్శిగా బి.కుబేరనాథ్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.