సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ప్రలోభాల పర్వం పెరిగింది. దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం ఏరులై పారుతోంది. దీంతో దాడులు చేసిన ఎన్నికల అధికారులు దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యాన్ని సీజ్ చేశారు. సుమారు రూ.540 కోట్ల విలువ చేసే లిక్కర్, నగదు స్వాధీనం చేసుకున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నగదును సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఏపీలో సుమారు రూ. 108 కోట్లనగదు, రూ.30 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు 143.47 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.
అలాగే 89.64 కోట్ల విలువైన మద్యం, 131.75 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 162.93 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, 12 కోట్ల విలువ చేసే గిఫ్ట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రూ. 108 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే 30 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.కొద్ది రోజుల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న ఏపీలో అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే ఆరు కోట్ల విలువైన వస్తువులను కూడా పట్టుకున్నారు.