ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 10:23 AM

ఏపీలో ఎన్నికల ఓటింగ్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ఓటర్లకు నగదును పంచేందుకు పలు పార్టీలు పెద్ద ఎత్తున నగదును పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్సిటివ్‌గా గుర్తించిన నియోజక వర్గాలు సహా అనేక ప్రాంతాలలో పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల దృష్ట్యా పోలీసు బృందాల పెట్రోలింగ్‌, తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలో భారీగా నగదును పట్టుకున్నారు. ఆ క్రమంలో అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ గరికపాడు వద్ద తెలంగాణ రాష్ట్రం నుంచి లారీలో తరలిస్తున్న 8 కోట్లు రూపాయలకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు పెద్ద ఎత్తున లభించడంతో వాటిని లెక్కించేందుకు పోలీసులు కౌంటింగ్ మెషీన్‌లు తెప్పించి లెక్కించారు. అయితే పోలీసులకు ముందుగానే పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు ఈ నగదును పట్టుకున్నారు. అయితే ఈ క్యాష్ ఎవరిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం తెలియలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com