చంద్రబాబు స్వప్నమైన వికసిత్ రాయలసీమను సాకారం చేసుకునేందుకు ఆయన మిషన్ రాయలసీమ పథకాన్ని రూపొందించుకుని ఉన్నారని, దాని ఆచరణకు సహకరించాలని ప్రధాని మోదీని లోకేశ్ కోరారు. లోకేశ్ విజ్ఞప్తి పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని, రానున్న ఐదేళ్లలో రాయలసీమ రూపురేఖలు సమూలంగా మార్చివేస్తామని ఆ తరువాత ప్రధాని ప్రకటించారు.