అప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్నది నా కోరిక. ఇప్పుడు అమరావతిని, పోలవరాన్ని, పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తే వాటి ఫలితాలు వస్తాయని అనుకున్నాం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దాన్ని వాళ్లు (ప్రజలు) అర్థం చేసుకోలేకపోయారా? నేను సరిగా చెప్పలేకపోయానా? తెలుగు వారిని ప్రపంచంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దాలనేది నా అభిలాష. పేదరికంలేని తెలుగు సమాజాన్ని నిర్మించాలి. నా జీవితంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకూ దీనికోసమే కృషి చేస్తాను. జగన్ సైకో అని 2019 ఎన్నికల సమయంలోనే నేను చెప్పాను. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు నరసింహారావు జగన్ మనస్తత్వం మీద చాలా వ్యాసాలు రాశారు. అప్పుడు ప్రజలు విశ్వసించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సైకో అంటున్నారు అని అన్నారు.