ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రవాసాంధ్రులను సీఎం బెదిరిస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 10:23 AM

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని టీడీపీ యూఎ్‌సఏ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి తెలిపారు. జయరాం ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి బృందం గురువారం గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసింది. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ... చంద్రబాబు ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవాసాంధ్రులను బెదిరించడంతో పాటు వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. జగన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయితే ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి రావాలంటే ప్రత్యేక వీసా ఉండాలేమోనని ఎద్దేవా చేశారు. విధ్వంస పాలనకు ప్రజలు ముగింపు పలకాలని కోరారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ విజయం కోసం పలువురు ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి తరలివచ్చి ప్రచారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షుడు సతీష్‌ వేమన తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com