అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన కుప్పం సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్ బాబు లను సస్పెండ్ చేస్తూ గురువారం రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ గిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్ ను ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా నియమించారు. వెంకటసుబ్బయ్య, మోహన్ బాబులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.