ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లిలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 05:38 PM

అనకాపల్లి, విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి రైల్వే ట్రాక్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించామని సోమవారం దువ్వాడ జీఆర్‌పీ ఎస్‌ఐ కె.శాంతారామ్‌ తెలిపారు. మృతుని వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని, 5.2 అడుగుల ఎత్తు ఉన్నాడని తెలిపారు. నీలం కలర్‌ లుంగీ, నీలం కలర్‌ గళ్ల షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ట్రాక్‌ మధ్యలో మృతదేహం తలకు బలమైన గాయాలై ఉన్నాయని వివరించారు. మృతుడు వివరాలు తెలిసినట్టయితే దువ్వాడ జీఆర్‌పీ ఎస్‌ఐ సెల్‌నంబరు 7673906010కు సంప్రదించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com