ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్యసాయి జిల్లా: లైబ్రరీలో ఇదేం పాడు పని.. మరీ వాటిని కూడా వదలరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 08:36 PM

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో గ్రంథాలయం ఉంది. రోజూ స్థానికులు వెళ్లి బుక్స్ చదువుకుని వస్తుంటారు. సోమవారం కూడా జనాలు అక్కడికి వెళ్లి వచ్చారు.. సాయంత్రం అయ్యాక లైబ్రరీ ఇంఛార్జ్ తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే గ్రంథాలయం దగ్గర వాచ్‌మెన్ కాపలాగా ఉన్నారు.. అయితే సోమవారం రాత్రి జరిగిన ఘటన కలకలంరేపింది.


 కొత్తచెరువులో ఉన్న గ్రంథాలయంలోకి దొంగలు చొరబడ్డారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డు.. అక్కడే ఉన్న వాచ్‌మెన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై దాడికి తెగబడ్డారు. గ్రంథాలయంలో ఉన్న కుర్చీలు, ఫర్నీచర్, ఫ్యాన్లతో పాటుగా పాత పుస్తకాలు, చిత్తు కాగితాలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలియడంతో గ్రంథాలయం ఇంఛార్జ్ అక్కడికి వెళ్లారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొన్నటి వరకు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు లైబ్రరీని టార్గెట్ చేయడం కలకలంరేపుతోంది. నలుగురికి ఉపయోగపడే గ్రంథాలయంలో చోరీకి తెగబడటం చర్చనీయాంశమైంది. విచిత్రంగా పాత పుస్తకాలు, చిత్తు కాగితాలు కూడా తీసుకెళ్లడం ఆసక్తికరంగా మారింది. సిగ్గు లేకుండా ఇదేం పనిరా బాబూ అంటూ స్థానికులు చర్చించుకున్నారు.. మరీ అంత కక్కుర్తి ఏంటి అంటూ నవ్వుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com