కడప జిల్లాలో ఓ బేకరీ నిర్వాకం బయటపడింది.. కొడుకు పుట్టిన రోజు కోసం ఓ తండ్రి కేక్ కొనుగోలు చేసి తీసుకెళ్లగా ఊహించని పరిణామం ఎదురైంది. ఇంట్లో కేక్ కట్ చేసి తిటుంటే అసలు సంగతి బయటపడింది.. దీంతో ఆ కుటుంబం అవాక్కయ్యింది. బద్వేల్లోని ఆర్టీసీ బస్ట్ దగ్గర ఓ బేకరి ఉంది.. సోమవారం ఓ వ్యక్తి తన కుమారుడి పుట్టిన రోజు ఉందని కేక్ తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు కేక్ తింటున్న సమయంలో.. చేదుగా అనిపించింది. అనుమానం వచ్చి కేక్ను పరిశీలించారు.. అప్పుడు అసలు సంగతి బయటపడింది.
కేకును పరిశీలిస్తే కుళ్లినట్లుగా, బూజుపట్టి ఉంది.. ఆ సీన్ చూసి అవాక్కైన బాధితుడు నేరుగా వెళ్లి పురపాలక కార్యాలయం వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే కమిషనర్, అధికారులు రంగంలోకి దిగి బద్వేల్ బస్టాండ్ దగ్గర బేకరీలో తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకున్నారు. బేకరీలోని తినుబండారాలు, మిఠాయిలను పరిశీలించారు.. నాణ్యతలేకపోవడంతో రూ.10 వేల జరిమానా విధించారు. బద్వేలులో డయోరియా కేసులు నమోదవుతున్నాయని హెచ్చరించారు.. పట్టణంలో బేకరీలు, హోటళ్లు శుభ్రత పాటించాలని సూచించారు. బేకరీలు, షాపుల్లో తినుబండారాలు, ఆహార పదార్థాలు తాజాగా ఉండాలని సూచించారు.. ఒకవేళ లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.