ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామమందిరం పైకప్పు నుంచి లీకేజీ.. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ ఏమన్నారంటే

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 10:29 PM

అయోధ్య రామమందిరం గర్భాలయం పైకప్పు నుంచి నీరు లీక్ అవుతున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా స్పందించారు. గర్బగుడిలో ఎటువంటి లీక్‌లు కాలేదని తెలిపారు. విద్యుత్ కేబుల్స్ కోసం పెట్టిన పైపులను మూసివేయకపోవడంతోనే అందులో నుంచి నీరు లోపలికి వచ్చిందని పేర్కొన్నారు. మొదటి అంతస్తులో పనులు ఇంకా జరుగుతున్నాయని, రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం పూర్తయితే ఒక్క నీటి చుక్క కూడా లోపలికి రాదని చెప్పారు. జులై నాటికి మొదటి అంతస్తు పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు.


‘ఆలయ నిర్మాణ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాను.. పైకప్పు నుంచి ఎటువంటి లీక్‌లు లేవు.. విద్యుత్ వైర్ల కోసం పెట్టిన పైపులు ఇంకా తెరిచి ఉంచడంతో అందులోంచి వర్షపు నీరు లోపలికి వచ్చింది.. మొదటి అంతస్తులో పనులు ఇంకా జరుగుతున్నాయి.. ఇప్పటికే రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం ప్రారంభమైంది.. ఇది పూర్తయితే ఆలయం లోపలికి నీరు రావడం ఆగిపోతుంది’ అని మిశ్రా చెప్పారు. వచ్చే డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం మొత్తం పూర్తవుతుందని ట్రస్ట్ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు.


ఇక, శనివారం భారీ వర్షం కురవడంతో గర్భగుడిలోకి వర్షపు నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వర్షపు నీరు బయటకు పోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆరోపించారు. బాలక్ రామ్ విగ్రహం ముందు ప్రధాని పూజారి కూర్చునే చోటు, వీఐపీ దర్శనాలకు వచ్చే ప్రదేశంలో వర్షం నీరు చేరినట్టు ఆయన వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com