ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ బాలుడిపై అతడి స్నేహితులే అత్యాచారం చేశారు. తీవ్రంగా గాయపడిన బాధిత బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. అయితే బాలుడిపై అత్యాచారం చేసిన నిందితులంతా 10 నుంచి 12 ఏళ్ల వయసు వారేనని పోలీసులు పేర్కొన్నారు.