విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితుల నుండి http://vzmmobiletra ker. in/ పోర్టల్ కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొబైల్స్ ట్రేస్ చేసి, రూ. 11. 20 లక్షల విలువైన 62 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక, శనివారం శ్రీ దేవి దండుమారమ్మ కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో బాధితులకు అందజేశారు.