కథానాయకుడు సందీప్ కిషన్, రేజీనా, శ్రీ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం నగరం. ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ చిత్రానికి అశ్వినీకుమార్ సహదేవ్ నిర్మాత. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేశాను. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదిరించి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఆనందంగా ఉంది. రెండేళ్లుగా విజయాలులేని నాకు ఇంత గొప్ప విజయం దక్కడం సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. డెరెక్టర్ కనగరాజు మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తారని వూహించలేదన్నారు. డెరెక్టర్గా నేను చేసిన మొదటి చిత్రం విజయం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు.