న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి వల్లే ఈ రెండు రాష్ర్టాల్లో గెలుపు సాధ్యమైందన్నారు. ప్రజలు ప్రధాని మోదీని నమ్ముతున్నారని ఆమె తెలిపారు. బీజేపీ గెలుపు వెనుక ప్రతీ ఒక్క కార్యకర్త కృషి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీని ఇచ్చిందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.