ఏలూరు: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మంత్రి స్పిల్ వే వద్ద ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంజనీర్కు పోలవరం ప్రాజెక్టు గురించి తెలియాలని సూచించారు. అనంతరం మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భూ పరిహారానికి సంబంధించి మొత్తం చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.