అమరావతి: మంత్రివర్గ విస్తరణ ఆలోచన లేదని మంత్రి లోకేశ్ అన్నారు. మీడియాలో వార్తలు రాసి వివరణలు అడిగితే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అఖిలప్రియను కేబినెట్ నుంచి తొలగిస్తారనడంలో నిజంలేదన్నారు. అఖిలప్రియ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, బెలూన్ ఫెస్టివల్, సోషల్ మీడియా సమ్మిట్ నిర్వహించడంతో పాటు వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించారని లోకేశ్ చెప్పారు. విజయవాడలో బోటు ప్రమాదం దురదృష్టకరమని, బోటు ప్రమాదం ఘటనపై సీఎం సీరియస్గా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రమాద బాధ్యులను వదిలిపెట్టేది లేదన్నారు.