సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ ఎదుట గురువారం పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాట్లాడుతూ.. సొసైటీ కార్మికులను పర్మినెంట్ చేస్తామన్న సీఎం జగన్ నేడు మాట తప్పి మడిమ తిప్పారన్నారు. వేతనాలు సమయానికి చెల్లించలేకపోవడం వల్ల కార్మికులు మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. ధర్నాలో యూనియన్ కోశాధికారి కోటి వీరాంజనేయులు, కార్యాలయపు కార్యదర్శి ఆర్ డేవిడ్రాజు, పీజీకే మూర్తి, సద్గుణరావు, ఎలీషారావు, సాంబయ్య, దాసరి బుజ్జి, దాసు, మరియదాసు, గురుమూర్తి, నాంచారమ్మ, మేరి, సువార్తమ్మ, యశోధ, మరియమ్మ, గోవిందమ్మ పాల్గొన్నారు.