రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ వివాహిత తన ప్రియుడిని హత్యచేసింది. తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాలని బలవంతం చేయడంతో అతడిని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. గోవింద్గఢ్లోని ధోడ్సర్ గ్రామానికి చెందిన సుభాష్ (27) అనే యువకుడు జైపూర్ లోని ఫకీరానగర్ లో నివసిస్తున్నాడు. అతడు వినోద అనే యువతిని ప్రేమించాడు. కానీ ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆ యువతి తన భర్తలో కలిసి జైపూర్లోనే నివసిస్తోంది. భార్యాభర్తలిద్దరూ కంపెనీల్లో పనికి వెళ్తారు. అయితే పెళ్లై భర్త ఉన్నా వినోద తన ప్రియుడు సుభాష్ తో టచ్ లో ఉండేది. వారి మధ్య వివాహేతర సంబంధం కొన్నాళ్ల పాటు కొనసాగింది. చివరకు వీరి వ్యవహారం వినోద భర్తకు తెలిసింది. ఇకపై బుద్ధిగా ఉంటానని వినోద తన భర్తకు చెప్పింది.
మార్చి 6న వినోద భర్త పనికి వెళ్లిన సమయంలో సుభాష్ వారింటికి వెళ్లాడు. వివాహేతర సంబంధం కొనసాగించాలని బలవంతం చేశాడు. దీంతో వినోద అతడికి ఊపిరాడకుండా చేసింది. చూస్తుండగానే అతడు మరణించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎప్పటిలా ఆమె ఫ్యాక్టరీకి పనికి వెళ్లింది. వినోద భర్త అనుకోకుండా ఇంటికి వచ్చాడు. సుభాష్ మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంట్లో మృతుడి సెల్ ఫోన్ లభ్యమయింది. అందులో వీరిద్దరి అసభ్యకర వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోను చూపించే సుభాష్ వినోదను బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఈ కేసులో వినోదను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అతడిని అప్రయత్నంగా చంపాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు.