విజయవాడ: నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత జగన్కు భయం పట్టుకుందని టీడీపీ యువనేత దేవినేని అవినాష్ అన్నారు. 2019లో ఎన్నికల్లోనూ చంద్రబాబే సీఎం అవుతారని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని బతిమాలే పరిస్థితికి జగన్ వచ్చారన్నారు. జగన్ పాదయాత్ర ప్రజల కోసం కాదు కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకే అని ఆయన ఆరోపించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకున్నారని వివరించారు.