గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల మధ్య ఇసుక వివాదం నెలకొంది. బోరుపాలెం రీచ్లో ఇసుక తవ్వకాల అంశంపై మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య పోటీ పడింది. బోరుపాలెం ఇసుక రీచ్ వద్దకు ఇరువర్గాల వ్యక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్థానిక సమాచారం మేరకు హుటాహుటిన భారీ సంఖ్యలో పోలీసులు బోరుపాలెంకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నేతల ఇసుక వివాదంపై అధిష్ఠానం ఆరా తీసింది. కాగా నిన్న జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద ఇసుక పంచాయితీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంత్రి జోక్యం చేసుకోవడంపై టీడీపీ అధిష్ఠానం సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.! కాగా ఆ మంత్రి ఎవరు..? ఏ ఎమ్మెల్యే వర్గీయులు ఇసుక రిచ్లకు పోటీపడ్డారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.