ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూసుకువెళ్లిన రిలయన్‌‌స షేర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 12:49 AM

ముంబయి : రిలయన్‌‌స జియో 4జి సర్వీసుల టారిఫ్‌ విధానాన్ని ప్రకటించడంతో రిలయన్‌‌స ఇండస్ట్రీస్‌ షేర్లు ఒక్కసారిగా దూసుకువెళ్లాయి. రిలయన్‌‌స మదుపర్లు ఈ ప్రకటనతో సానుకూలంగా స్పందించడంతో షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి. జియో టారిఫ్‌ ధర ఆకర్షణీయంగా ఉండడం, వినియోగదారుల సంఖ్య ఇప్పటికే పది కోట్లకు చేరుకోవడం షేరు పెరుగుదలకు కలసివచ్చాయి. రిలయన్‌‌స షేర్‌ విలువ ఏకంగా 11 శాతం పెరగడంతో మార్కెట్‌లో ఉత్సాహ వాతావరణం కనిపించింది. రిలయన్‌‌స షేర్లు 2009 తరువాత దూసుకుపోవడం ఇదే ప్రథమం. సెన్సెక్‌‌సలో రూ. 119.40 మేర పెరిగి రూ. 1207.65 స్థాయికి చేరుకోగా నిఫ్టీలో రూ. 119.30 మేర పెరిగి రూ. 1207.50 వద్ద నిలిచింది. నెలకు రూ. 303 చార్జీతో అన్‌లిమిటెడ్‌ కాల్‌‌సతో పాటు ప్రతి రోజు 1 జిబి డేటాను జియో ప్రకటించింది. అయితే, ఇతర ఆపరేటర్ల టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉండబం గమనార్హం. డేటా వినియోగం విపరీతంగా పెరుగుతుండబంతో పాటు 4జి సర్వీసులను దేశవ్యాప్తంగా అందజేయడంతో జియోకు ఆదరణ పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జియోను మరింత విస్తరించనుండడంతో మదుపర్లు వీటి షేర్లపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు వెల్‌కమ్‌ ఆఫర్‌, న్యూ ఇయర్‌ ఆఫర్‌లను ఉచితంగా అందిస్తున్న జియో సర్వీసులకు టారిఫ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు మంగళవారం రిలయన్‌‌స సంస్థల చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. టారిఫ్‌ల విధానం అందరికి ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయడం తదితర అంశాలు షేరు ఎదుగుదలకు దోహదం చేసినట్టు మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com