ఫ్రెషర్స జీతాలు పెంచకుండా పని చేయించుకుంటున్న వైనం
న్యూఢిల్లీ : మన దేశంలో ప్రతి ఏడాది వేలాది మంది ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. వారిలో మెజారిటీ విద్యార్థుల లక్ష్యం ఒక్కటే. సాఫ్టవేర్ ఇంజనీర్గా సెటిల్ అవడం. కొందరేమో క్యాంపస్ సెలక్షన్ల ద్వారా జాబ్లు కొట్టేస్తున్నారు. మరికొందరేమో, ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత కొన్ని కోర్సులు పూర్తి చేసి, జాబ్ పట్టేస్తున్నారు. చాలా మంది జాబ్ కోసం దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో, సాఫ్టవేర్ ఇంజనీర్లు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వస్తున్నారు. ఇదే అంశాన్ని సాఫ్టవేర్ కంపెనీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఐటిీ కంపెనీలన్నీ కుమ్మకై్క ఫ్రెషర్ల జీతాలను పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. ఈ క్రమంలో, అవి మాత్రం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి. గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా ఐటి సంస్థలు ఫ్రెషర్స జీతాలను తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నాయని ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఒ మోహన్ దాస్ పాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఫ్రెషర్సకు భారత ఐటి సంస్థలు సరైన జీతాలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. వారి జీతాలు పెరగకుండా టాప్ ఐటి కంపెనీలన్నీ కుమ్మక్కు అయ్యాయని ఆయన ఆరోపించారు. ఐటి సంస్థలు ఇలా వ్యవహరించడం ఈ రంగానికి అంత మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మెరుగైన జీతాలు ఇవ్వకపోతే ప్రతిభ ఉన్న ఫ్రెషర్స ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపరని మోహన్ దాస్ తెలిపారు. ప్రస్తుతం ఐటి సంస్థల్లో చేరుతున్న వారిలో ఎక్కువ శాతం సెకండ్ గ్రేడ్ కాలేజీల నుంచి వస్తున్నారని, అయినప్పటికీ, వారిలో నైపుణ్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. టాప్ గ్రేడ్ కాలేజీల నుంచి కూడా ఫ్రెషర్స రావాల్సిన అవసరం ఉందని పాయ్ అన్నారు.