ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2024 ఎన్నికల్లో 300కు పైగా స్థానాలు గెలవడం సందేహమే : గులాం నబీ ఆజాద్

national |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 02:45 PM

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 300కు పైగా సీట్లను కాంగ్రెస్ సాధించే అవకాశాలపై.. సందేహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ 300కు పైగా స్థానాలు గెలవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జమ్ము కశ్మీర్ లోని పూంఛ్ లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన ఆయన... ఆర్టికల్ 370 రద్దు పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోగలదన్న గులాం నబీ అజాద్ ఆ తర్వాతి అధికారం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సర్కారే ఆర్టికల్ 370ని రద్దు చేసిందని అజాద్  గుర్తు చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com