దేశరాజధానిలో కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. లాక్డౌన్పై కేజ్రీవాల్ సోమవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో ప్రత్యేక సమావేశంలో చర్చించారు. లాక్డౌన్ నేటి రాత్రి నుంచి మొదలై వచ్చే సోమవారం ఉయదం వరకూ అమల్లోకి రానుంది.
కాగా, దిల్లీలో ఆదివారం 25,462 కరోనా కేసులు నమోదు కాగా, 161 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దిల్లీలో పాజిటివిటీ రేటు 30శాతంగా కొనసాగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే దిల్లీలో వారాంతపు లాక్డౌన్ కొనసాగుతోంది.