దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మోడీకి ఎదురు లేదని నిరూపించాయి ఈ ఉప ఎన్నికలు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనానికి అద్దం పట్టేలా ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో 59 స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు నిర్వహించారు. వీటిలో అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెల్చుకుంది.
మధ్యప్రదేశ్లో ఆ పార్టీ 18 సీట్లను దక్కించుకొని, మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫలితంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం పడిపోయే ముప్పు తప్పింది. * గుజరాత్లో ఉప ఎన్నికలు జరిగిన 8 స్థానాలూ కమలం ఖాతాలోకే చేరాయి.
ఉత్తర్ ప్రదేశ్లోనూ ఆ పార్టీ తన పట్టు నిలబెట్టుకుంది. ఉత్తర్ ప్రదేశ్లో 7 స్థానాలకుగాను ఆరింటిని కమలనాథులు కైవసం చేసుకున్నారు. మరో సీటును సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) దక్కించుకుంది. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఊపులో విజయకేతనం ఎగురవేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కర్ణాటకలోని రెండు విధాన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధించింది.
మణిపుర్లో 5 స్థానాలకుగాను 4 బీజేపీ ఖాతాలోకి చేరాయి.
ఒడిశాలో రెండు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాపై అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ)దే పైచేయి అయింది.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు ఊరట లభించింది. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి మరణించడంతో ఖాళీ అయిన మర్వాహీలో బీజేపీను కాంగ్రెస్ ఓడించింది.
ఝార్ఖండ్లో రెండు స్థానాల్లోనూ భారతీయ జనతాపార్టీకి చుక్కెదురైంది. ఓ స్థానాన్ని జేఎంఎం, మరో సీటును కాంగ్రెస్ దక్కించుకున్నాయి.
నాగాలాండ్లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) ఒక స్థానాన్ని సాధించగా, స్వతంత్ర అభ్యర్థి మరోచోట గెలుపొందారు.